రిజర్వేషన్ల విధానంలో కొత్త పోకడలు
.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు రిజర్వేషన్ల పరిధిని విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో మునుపున్న షెడ్యూల్ద్ కులాల (ఎస్.సి.), షెడ్యూల్డు తరగతుల (ఎస్.టి.) జాబితాలో కొత్త వర్గాలను చేరుస్తున్నాయి. ఇలా విస్తరించడానికి ఆర్థిక వెనుకబాటుతనాన్ని కారణంగా చూపుతున్నాయి. ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించేటట్టయితే అంతకనా వెనుకబడి ఉన్న సామాజిక వర్గాలను విస్మరించినట్టు అవుతుంది. లేవనెత్తవలసిన ప్రశ్న ఏమిటంటే 10 శాతం, 13 శాతం కులాలకు ఎందుకు పరిమితం చేయాలి. ఈ సూత్రం ద్వారా ప్రభుత్వాలు ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వర్గాల ప్రాతిపదికగా రిజర్వేషన్ల గురించి ఆలోచిస్తాయి. కొత్త రిజర్వేషన్ల విధానంలో ఈ ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు. ఇలాంటి రాజకీయాలవల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మైనారిటీలు ఓటర్లుగా అంత ఆకర్షణీయంగా కనిపించక పోవచ్చు.
కొత్త రిజర్వేషన్ల విధానంతో మరో సమస్య కూడా ఉంది. ఈ పద్ధతి రాజ్యాంగ నిర్మాతల దృష్టిలో ఉన్న "పురోగమన" అంశాన్ని గమనంలో ఉంచుకోదు. షెడ్యూల్డ్ జాబితాలో ఉన్న వారికి అవకాశాలు కలిగించడంలో ఉన్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ నిర్మాతలు రిజర్వేషన్ల విధానాన్ని రూపొందించారు. ఈ కారణంవల్లే మన దేశంలో అమెరికాలో ఉన్న సానుకూల చర్య పద్ధతి కాకుండా రిజర్వేషన్ పద్ధతి అనుసరించారు. ఇది మొదట్లో అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించింది. దీనివల్ల ఫలితం ఉండాలనుకున్నారు. సానుకూల చర్యవల్ల నిర్దిష్ట ఫలితం ఉంటుందన్న నమ్మకం లేదు. కొత్త రిజర్వేషన్ల విధానంవల్ల సామాజికంగా వెనుకబడిన కులాల వారికి ప్రాతినిధ్యం అన్న సూత్రం మరుగున పడవచ్చు. ఎంపిక చేసే వారు, పోటీ పడే వారు ఒక సామాజిక నేపథ్యానికి చెందినవారు కావచ్చు. అలాంటప్పుడు ఎంపిక చేసే వారు నియామకాలు చేసేటప్పుడు మరింత నైరూప్య ప్రమాణాలను పాటిస్తారా? లేదా అగ్రవర్ణాలలో ఉప కులాలను దృష్టిలో ఉంచుకుంటారా?
కొత్త విధానంవల్ల అయినా, మునుపటి విధానంవల్ల అయినా లబ్ధి పొందే వారు ప్రభుత్వ రంగానికే పరిమితం అవుతారు. అందువల్ల ప్రైవేటు రంగంలో అవకాశం ఉండదు. ప్రైవేటు రంగం రిజర్వేషన్ల పరిధికి దూరంగానే ఉండిపోతుంది. అందువల్ల రిజర్వేషన్లు వర్తించే వారు ప్రభుత్వ ఉద్యోగాల మీదే ఆధారపడాలి.
అయితే నిర్దిష్ట కులం దృష్టితో చూసినప్పుడు సిద్ధాంత రీత్యా కోటా విధానాన్ని విస్తరించినందువల్ల ఫలితం ఉండవచ్చు. అగ్ర కులాల వారికి, దళితులు కాని వారికి, వెనుకబడిన తరగతులకు చెందని వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవచ్చు. అయితే ఈ పద్ధతివల్ల అంతర్గతంగానూ, బహిర్గతంగానూ కొందరిని వదిలివేయడానికి అవకాశం ఉంటుంది. ఉన్న అవకాశాలను పోటీ తత్వంతో రిజర్వేషన్ల ద్వారా అందుకోవాలంటే ఎస్.సి., ఎస్.టి.ల విషయంలో జరిగినట్టు అంతర్గత తేడాలకు దారి తీస్తుంది. దీనివల్ల కుల చైతన్యాన్ని వదిలి వ్యక్తులుగా నిలబడే వీలుంటుందని వాదించే వారూ ఉంటారు. వ్యక్తులుగా నిలబడితే కులం ప్రాతిపదికగా కాకుండా సత్తా ఆధారంగా నిలబడే అవకాశం ఉంటుందనే వారూ ఉన్నారు. కుల చైతన్యం నుంచి బయటపడి కుల ప్రాతిపదిక మీద ఉన్న సామాజిక నైతికతను అంతం చేసే వీలుంటుంది. అంటే వ్యక్తులు ఆధునిక విధానాల ఆధారంగా పోటీ పడతారు. అయితే ఇది అమాతం జరిగిపోదు. ఆధునికత విసిరే సవాళ్లను ఎదుర్కోలేనప్పుడు కులం మీద ఆధారపడే పరిస్థితి రావచ్చు.
మరో వేపున న్యాయాన్ని విస్తరించడం అంటే రిజర్వేషన్ల వల్ల లభ్ది పొందుతున్నారనే మచ్చ రూపు మాపే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు సామాజిక న్యాయం, దళితులు అన్న మాటలను ఒక సారి ఒక అర్థంలో మరోసారి మరో అర్థంలో వాడతాయి. కొత్త కోటా విధానం వచ్చే లోపల రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు సామాజిక న్యాయం అన్న పదానికి పెడార్థం తీస్తారు. ఈ పదాన్ని దళితులను ఉద్దేశించి వాడే అలవాటు ఉంది. కొత్త కోటా విధానం సామాజిక న్యాయాన్ని సమానత్వ దృష్టితో చూడడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడే సామాజిక న్యాయం అన్న భావన సర్వజనామోదం పొందుతుంది. దళితులు, ఆదివాసుల విషయంలో లాగా సామాజిక న్యాయాన్ని చులకన భావంతో చూసే వీలుండదు. సమానత్వం అన్న భావన బలహీనంగా ఉన్న సామాజిక సంబంధాలను పటిష్ఠం చేస్తాయి.